వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసంతృప్తి, ఆజాద్‌తో భేటీకి తెలంగాణ ఎంపీలు నో

By Pratap
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ‌‌: తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు పట్ల కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో ఇక సమావేశం కాకూడదని నిర్ణయించుకున్నారు. బుధవారం ఉదయం తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానా రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అధిష్టానం ఏ మాత్రం దిగి రావడం లేదు. సంప్రదింపులకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ సంప్రదింపులు రాష్ట్ర ఏర్పాటుకే జరగాలని, దానికి కూడా కాల పరిమితి విధించాలని తెలంగాణ పార్లమెంటు సభ్యులు, మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. అందుకు అధిష్టానం అంగీకరించడం లేదు.

తెలంగాణ అంశాన్ని మళ్లీ మొదటికి తెస్తూ గులాం నబీ ఆజాద్ మాట్లాడుతుండడంతో కాంగ్రెసు తెలంగాణ నేతలు గుర్రుగా ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో తెలంగాణ నేతలు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో కూడా ఏ విధమైన పురోగతి లేదు. దీంతో తెలంగాణ నేతలు తీవ్ర నిరాశతో కనిపించారు. ఆజాద్‌తో భేటీ కాకూడదని పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకోవడంతో మంత్రులు జానా రెడ్డి, సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆయనతో బుధవారం ఉదయం సమావేశమయ్యారు.

English summary
Congress Telangana MPs decided not to meet Ghulam Nabi Azad. Ministers Jana Reddy, Saraiah and Ponnala Laxmaiah met Azad today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X