లగడపాటి, కావూరిలపై దుమ్మెత్తిపోసిన కెటిఆర్

రాజీనామాలతో కేంద్రంలో కదలిక వచ్చిందని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రజలు సమైక్యవాదానికి మద్దతు పలకడ లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్నది సీమాంధ్ర పెట్టుబడిదారులేనని ఆయన విమర్శించారు. కావూరి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. తమ స్వార్థం కోసం సీమాంధ్ర నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులది ఆర్థికవాదం, అవకాశవాదమని ఆయన అన్నారు. ఢిల్లీలో జరిగిన విశాలాంధ్ర మహాసభ సదస్సులో తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వక్తలు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విశాలాంధ్ర మహాసభను ఉనికి లేని సంస్థగా ఆయన అభివర్ణించారు. అందులో ప్రసంగించి తెలంగాణను వ్యతిరేకించిన వక్తలను ఆయన కుహనా మేధావులుగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications