హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొదట హైదరాబాదులో దోచిందెంతో తేల్చండి: నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: సీమాంధ్ర ప్రజాప్రతినిధులు నిత్యం హైదరాబాదును అభివృద్ధి చేశామని చెబుతున్నారని అసలు వారు దోచిందెంతా, అభివృద్ధి చేసిందెంతో తేల్చాలని తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరింపబడిన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి గురువారం ప్రశ్నించారు. నరమాంసానికి అలవాటు పడిన పులిలా సీమాంధ్ర నేతలు తెలంగాణను దోచుకునేందుకు తయారయ్యారని ఆరోపించారు. హైదరాబాదులో ఉన్న వాళ్లంతా తెలంగాణ వాళ్లేనని సీమాంధ్రులు ఎవరూ లేరని నాగం అన్నారు. మంత్రి దానం నాగేందర్ పొల్లు మాటలు మాట్లాడ వద్దని హెచ్చరించారు.

నాగం టిడిపిపైనా విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయిస్తే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నమ్ముతారని చెప్పారు. టిడిపిది జెండా ఒకటి అజెండాలు మాత్రం రెండుగా ఉన్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసినట్లు చిదంబరానికి లేఖ రాస్తే ప్రజలు టిడిపి పట్ల విశ్వాసంతో ఉంటారన్నారు. టిడిపి నేతలు రాజీనామాలు ఆమోదింప జేసుకొని బస్సుయాత్రలు చేపట్టాలన్నారు. కాగా సమైక్యాంధ్రలో పాల్గొన్న టిడిపి నేతలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తదితర పది ప్రశ్నలతో కూడిన ఓ లేఖతో టిటిడిపిని నాగం ప్రశ్నించారు.

English summary
TDP suspended mla Nagam Janardhan Reddy questioned seemandhra leaders on hyderabad today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X