వైయస్ జగన్తో కాంగ్రెసు చర్చలు జరుపుతోందా?

అది జరిగితే మనకే లాభమని, వారిది కేవలం పదవుల తగాదా అని ప్రజలకు అర్ధం అవుతుందని, మనం బలంగా ఉండి ప్రజలకు చేరువ అయితే వారు కలిసినా విడిపోయినా పెద్ద తేడా ఉండదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. మధ్యాహ్న భోజనం సందర్భంగా ప్రతిరోజూ కొందరు నేతలతో చంద్రబాబు వరుసగా నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా కొంత మంది నేతలతో శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని ఆ డబ్బుతో పార్టీలు పెట్టి నడుపుతున్నవారిని గెలిపిస్తే నడిబజార్లో అమ్మేస్తారన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలని, మొహమాటపడవద్దని ఆయన వారికి సూచించారు. పార్టీ అంతర్గత అంశాలపై కూడా ఆయన అన్నారు.
నియోజకవర్గాలకు ఇన్ఛార్జులుగా ఉన్నవారు బాగా పనిచేస్తే టిక్కెట్లు వారికే వస్తాయని, టిక్కెట్టు తమదేనని వారు ఈ రోజు నుంచే ధైర్యంగా ఉండవచ్చునని, కాని ఆ ధైర్యంతో పనిచేయకుండా కాలం గడిపితే ఊరుకొనేది లేదని ఆయన అన్నారు. పనితీరు బాగోలేకపోతే మార్చడానికి నేను వెనకాడనని, బాగా పనిచేస్తే నా పక్కనే ఉంచుకొంటానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications