పిఎం వద్ద తెలంగాణపై కుండబద్దలు కొట్టిన జైపాల్ రెడ్డి
కేంద్ర మంత్రిగా, పార్టీ సీనియర్ నేతగా సమస్య పరిష్కారానికి తాను చేయాల్సిందంతా చేస్తానని ఆయన అన్నారు. సమస్యను సత్వరమే పరిష్కరించాలని, జాప్యం చేయడం సరి కాదని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రధాని నిర్ణయం తీసుకోలేరని, కాంగ్రెసు నాయకత్వం, యుపిఎ పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రజలకు తాను ఇచ్చే సందేశం ఏమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను కాంగ్రెసు నాయకత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు. రాష్టంలో రాష్ట్రపతి పాలన విధిస్తారనే అంశంపై తాను ప్రధానితో మాట్లాడలేదని ఆయన చెప్పారు.
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం వైఖరేమిటో తనకు తెలియదని ఆయన అన్నారు. తెలంగాణపై తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. మిగతా విషయాలపై తాను వ్యాఖ్యలు చేయబోనని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు సమాధానంగా అన్నారు. 14ఎఫ్ తీర్మానం తొలగింపుపై శాసనసభ తీర్మానాన్ని గౌరవించాలని ఆయన అభిప్రాయపడ్డారు.