హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'తెలంగాణ అడగండి, హైదరాబాద్ మాదంటే కబడ్దార్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Malladi Vishnu-Jogi Ramesh
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత నేతలపై సీమాంధ్ర ప్రజాప్రతినిధులు శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని అడగండి. అంతే కానీ హైదరాబాద్ మాది అంటే మాత్రం ఊరుకునేది లేదని కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. హైదరాబాదు ఎవరి సొత్తూ కాదని అన్నారు. హైదరాబాదును అందరూ కలిపి అభివృద్ధి చేశారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే తమకు అభ్యంతరం లేదని అయితే హైదరాబాదు విషయంలో మాత్రం సీమాంధ్రులకూ హక్కు ఉందన్నారు.

పార్లమెంటు సభ్యులను వ్యక్తిగతంగా విమర్శించడం తెలంగాణ ప్రజాప్రతినిధులు మానుకోవాలని అన్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే కబడ్దార్ అని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధుల రాజీనామాలన్నీ రాజకీయ కుట్ర అని విమర్శించారు.

English summary
Seemandhra mlas Jogi Ramesh and Malladi Vishnu fired at telangana leaders. They suggested that ask for telangana but not Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X