భేటీలతో తెలంగాణ రాజకీయ నేతలు బిజీబిజీ
కోదండరామ్ శుక్రవారంనాడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్తో కూడా సమావేశమయ్యారు. గద్దర్ శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్లో రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధులకు తేనీటి విందు ఇచ్చారు. ఈ విందులో కె. కేశవరావు, వివేక్, మందా జగన్నాథం (కాంగ్రెసు), ఈటెల రాజేందర్ (తెరాస), జైపాల్ యాదవ్, రాములు (తెలుగుదేశం), నాగం జనార్దన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజీనామాలు చేసిన తెలుగుదేశం శాసనసభ్యులు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.
ఇదిలా వుంటే, కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కలిసి తెలంగాణ అంశంపై మాట్లాడారు. ఆ తర్వాత కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీమాంధ్ర నాయకులపై నిప్పులు చెరిగిన అనంతరం హనుమంతరావు జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు.