ముఖ్యమంత్రి మారుతారు: అంబటి రాంబాబు

నిరుపేదల కోసం కేవలం రాయితీలు ప్రకటి్స్తూ ప్రభుత్వంపై ఆధారపడే విధంగా కాకుండా స్వయంగా అభివృద్ధి చెంది ఆదాయాలను సమకూర్చుకునే విధానాలను అమలు చేయాలని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను కోరారు. మద్య నిషేధం విషయంలో జగన్ టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్టీ రామారావు బాటలో నడవాలని ఆమె సూచించారు సమాజాన్ని అర్థం చేసుకున్నవాడిగా జగన్ సమాజాన్ని ప్రక్షాళన చేయాలని ఆమె అన్నారు. మనమంత తెలుగు ప్రజలమని, ఈ భావాన్ని గౌరవించాలని ఆమె అభిప్రాయపడ్డారు. జగనన్న రథచక్రాలు వస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు.












Click it and Unblock the Notifications