తెలంగాణను జగన్ తేల్చాలి: తెలంగాణ నేతలు

తెలంగాణ సెంటిమెంటును గౌరవించాలని మాజీ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తాను తెలంగాణవాదినని, అందులో సంశయం లేదని ఆయన అన్నారు. 2009 డిసెంబర్ 23వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనతో తెలంగాణ రాదేమోనని వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని కోస్తా, రాయలసీమ ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణపై ప్రస్తుత అనిశ్చితికి కేంద్ర ప్రభుత్వమే కారణమని మాజీ శానససభ్యుడు ప్రతాప రెడ్డి అన్నారు. వైయస్ జగన్ తెలంగాణకు అనుకూలగా నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణపై గౌరవప్రదమైన నిర్ణయం తీసుకోవాలని శానససభ్యురాలు కొండా సురేఖ అన్నారు.












Click it and Unblock the Notifications