ప్రాణత్యాగం చేసిన విద్యార్థులకు నష్టపరిహారం: కెకె
తెలంగాణ ఉద్యమాన్ని పార్లమెంటు దాకా తీసుకు వెళ్లేందుకే టి-కాంగ్రెసు రాజీనామాలు చేసిందన్నారు. హింసను తప్పించడానికే రాజీనామాలు చేశామని అన్నారు. నగర పోలీసు కమిషనర్ ఎకే ఖాన్ ఉస్మానియా విశ్వ విద్యాలయ విద్యార్థుల దీక్షకు అనుమతి లేదని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేశవరావు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల బలిదానాలపై డిజిపి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
English summary
Congress senior leader K Keshava Rao said today that telangana congress leaders were not resigned for blackmail. They resign to take parliament Telangana agitation.
Story first published: Sunday, July 10, 2011, 16:29 [IST]