బొత్స భేటీ, వెనక్కి తగ్గని తెలంగాణ ఎమ్మెల్యేలు

సీమాంధ్ర నాయకులను సంప్రదిస్తామని బొత్స చెప్పినట్లు ఆయన తెలిపారు. తమ అభిప్రాయాలను అధిష్టానానికి విన్నవించి, వారి మాటను తెలియజేస్తానని చెప్పినట్లు కూడా చెప్పారు. రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని బొత్స సత్యనారాయణ సూచించారని, అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటిస్తేనే ఉపసంహరించుకుంటామని చెప్పామని ఆయన అన్నారు. రేపు తాము చేపట్టబోయే నిరాహార దీక్ష గురించి బొత్స తమను అడగలేదని, నిరాహార దీక్ష కొనసాగుతుందని, తమ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవాహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు రాలేదని ఆయన చెప్పారు. బొత్సతో జరిగిన భేటీలో 20 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. సమాచారం అందకపోవడం వల్ల అందరూ రాలేకపోయారని దామోదర్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications