హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భానుకు సహకరించారని హైకోర్టులో వల్లభనేని పిటిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamsi
హైదరాబాద్: విజయవాడ మాజీ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులుపై సిబిఐచే విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. వల్లభనేని వంశీ తరఫున ఆయన లాయరు చిరంజీవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళలకు అసభ్యకర సంక్షిప్త సందేశాలు(ఎస్సెమ్మెస్‌లు) పంపించారని, మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు పరోక్షంగా సహకరించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆధారాలుగా ఓ టీవీ ఛానల్ ప్రసారం చేసిన వీడియోలను ఆ పిటిషన్‌తో కలిపి హైకోర్టుకు సమర్పించారు. కాగా అప్పటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అరవింద రావు, సీతారామాంజనేయులు, పడమట సత్యనారాయణపురం సిఐకి హైకోర్టు ఈ కేసుపై రెండు వారాల్లో కొంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

English summary
Telugudesam party senior leader Vallabhaneni Vamsi filed a petition on Vijayawada former CP Seetharamanjaneyulu that he helped to Bhanu Kiran, who was main accused in Maddelacheruvu Suri murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X