కాంగ్రెసు కండువాతో దీక్షలో కెసిఆర్, కవిత స్టెప్పులు

తెలంగాణపై అఖిలపక్ష నిర్ణయనికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నది సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అని ఆరోపించారు. కేంద్రం తెలంగాణ ప్రకటించి వెనక్కి తీసుకున్నప్పటికీ టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఇన్నాళ్లు ఓపిక పట్టారని అన్నారు. రెండేళ్ల పాటు నిరీక్షించిన ప్రజాప్రతినిధులు చివరకు చేసేది లేక రాజీనామా చేశారని అన్నారు. ఇష్టం లేకపోతే విడిపోవచ్చునని ఆంధ్రలో కలిపినప్పుడే నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణకు అన్ని విషయాల్లోనూ అన్యాయం జరిగిందని ఇప్పుడు తెలంగాణ ప్రజలు పిడికిలి ఎత్తారని అన్నారు. తెలంగాణపై కేంద్రం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయిందన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం, స్వపరిపాలన కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు.
కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. తెలంగాణ సాధన కోసం రాజీనామా చేసిన కాంగ్రెసు ప్రజాప్రతినిధుల చొరవను చరిత్ర మరవదన్నారు. అవాస్తవ కథనాలు ప్రచురించ వద్దని సీమాంధ్ర మీడియాను కెసిఆర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఐక్యమత్యంతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధన కోసం జెండా, అజెండాలు పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు. అందరూ తెలంగాణ జెండా కింద పని చేయాలని సూచించారు. కళాకారులు పాటలు పాడుతున్న సమయంలో రాజయ్య, మందా జగన్నాథం, కవిత స్టెప్పులేసి అందరినీ అలరించారు.












Click it and Unblock the Notifications