వైయస్ మృతిలో జగన్పై అనుమానం!: లగడపాటి

వైయస్ మృతిని నిచ్చెనలా చేసుకొని జగన్ రాజకీయం నెరపుతున్నారని అలాంటి జగన్పై చాలామందికి అనుమానాలు ఉన్నాయన్నారు. వైయస్ మృతి చెందిన సమయంలో రాష్ట్రం మొత్తం విషాదంలో ఉంటే జగన్ రాజకీయ విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు. జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. నాడు వాతావరణం బాగా లేదని విజయమ్మ చెప్పినా వైయస్ ప్రయాణం చేసి ప్రమాదం కొనితెచ్చుకున్నారని అన్నారు. తెలంగాణ విషయంలో శ్రీకృష్ణ కమిటీ ఆరవ సిఫార్సును అమలు చేయాలని ఆయన కోరారు. మంత్రి తోట నరసింహంపై దాడి అమానుషం అన్నారు.












Click it and Unblock the Notifications