వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పనిసరి పరిస్థితిలో నిరవధిక సమ్మె: స్వామిగౌడ్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ సంఘాలు గురువారం సాయంత్రం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. తప్పనిసరి పరిస్థితిలో నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టిఎన్‌జీవో) నాయకుడు స్వామిగౌడ్ చెప్పారు. నోటీసు ఇచ్చిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆగస్టు 1వ తేదీ నుంచి తెలంగాణ ఉద్యోగులు సామూహిక సెలవులు పెడతారని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యోగులు ధర్నాలకు, రిలే నిరాహారదీక్షలకు, ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతారని ఆయన అన్నారు. ఏడో తేదీ వరకు ఆ కార్యక్రమాలు సాగుతాయని ఆయన చెప్పారు. అప్పటి కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు రాకపోతే 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ఆయన తెలిపారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ - 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణ ఉద్యోగులకు ఏనాడూ న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలోని 14ఎఫ్ నిబంధనను కూడా ప్రభుత్వం తొలగించలేకపోయిందని ఆయన అన్నారు. ప్రభుత్వం తన హామీలను నెరవేర్చనందుకే ఆందోళనకు దిగుతున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Telanagna employees unions serves strike notice to State Government today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X