సిఎం పీఠం కోసమే తెలంగాణ ఉద్యమం: జెసి

JC Diwakar
విజయవాడ: ముఖ్యమంత్రి పీఠం కోసమే తెలంగాణ ఉద్యమం నడుస్తోందని కాంగ్రెసు సీమాంధ్ర సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. విజయవాడలో ఏర్పాటైన సమైక్యాంధ్ర రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి సీమాంధ్ర నాయకుడు మూడేళ్లు, తెలంగాణ నాయకుడు రెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉండేలా చూడాలని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యమం వెనకబాటుతనం వల్ల వచ్చింది కాదని, నాయకుల పదవుల ఆకాంక్ష వల్ల వచ్చిందని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఏ విధమైన పొరపొచ్చాలు లేవని ఆయన అన్నారు.

రాజకీయ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఆయన అన్నారు. వేర్పాటువాదానికి అంత ప్రాధాన్యం లేదని ఆయన అన్నారు. విభజన సమస్య మన రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది కాదని, దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులే తెలంగాణ కావాలని అంటున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ ఆస్తులపై సిబిఐ ప్రాథమిక విచారణకు కోర్టు ఆదేశించడం వెనక ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని ఆయన అన్నారు. సిబిఐ విచారణకు ముఖ్యమంత్రి లేఖ రాస్తే పరిస్థితి మరోలా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత మంత్రి పి. శంకరరావు ప్రైవేటు వ్యక్తిగానే జగన్ ఆస్తులపై హైకోర్టుకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+