వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపి, వైయస్ జగన్ కలిశారు: ఆత్మీయ పలకరింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy and KVP Ramachandra Rao
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కెవిపి రామచంద్రారావు ఆదివారం కలుసుకున్నారు. వారిద్దరూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కూతురు పెళ్లికి వైయస్ జగన్, కెవిపి రామచంద్రారావు హాజరయ్యారు. ఈ వేదికపై వీరిద్దరూ కలుసుకొని పలకరించుకున్నారు. వారిద్దరూ తమ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవన్న తరహా మాట్లాడుకున్నారు. ఈ పెళ్లికి వైయస్ వివేకానందరెడ్డి, గల్లా అరుణ కుమారి తదితర ప్రముఖులు హాజరయ్యారు.

కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత రోశయ్య హయాంలో రాజకీయ సలహాదారుడిగా కొనసాగినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కెవిపి రామచంద్రారావు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే జగన్ హవాను అడ్డుకోవడానికి కెవిపిని పిసిసి అధ్యక్ష పీఠంపై కూర్చుండ బెడతారని లేదా మరో మంచి పదవి ఇస్తారనే వార్తలు వచ్చాయి. పిసిసి పదవి కోసం కెవిపి వారం రోజుల పాటు ఢిల్లీలో తిష్ట వేసినట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెసు అధిష్టాం సైతం జగన్‌ను ఎదుర్కొనడానికి కెవిపికి ఏదో ముఖ్యమైన పదవి ఇవ్వాలన్న అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పెళ్లిలో కెవిపి, జగన్ పెళ్లిలో ఆత్మీయంగా మాట్లాడుకోవడం చర్చానీయాంశమయ్యింది. కాగా ఇప్పటి వరకు కెవిపి, జగన్ ఎవరూ ఒకరిపై ఒకరు చిన్న కామెంట్ చేయలేదు. ఎమ్మెల్యే కొండా సురేఖ మాత్రం ఓమారు కెవిపిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

English summary
YSR Congress party president YS Jaganmohan Reddy met today KVP Ramachandra Rao in Bumana Karunakar Reddy daughter's meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X