తెలంగాణ ఇచ్చేది లేదని తేల్చిన ప్రణబ్ ముఖర్జీ

రాష్ట్రం సమైక్యమా, ప్రత్యేకమా అనేది ఒక రోజులో తేలేది కాదని ప్రణబ్ అన్నారు. రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు తమ విధానాలను మార్చుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వైఖరిని మార్చుకున్నారని ఆయన అన్నారు. బిజెపికి తాము మూడు లేఖలు రాశామని, అయినా సమాధానం రాలేదని ఆయన చెప్పారు. సంప్రదింపుల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని ఆయన అన్నారు. తమ వాదనలో బలం ఉందని తేలిందని గాదె వెంకటరెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications