బొత్స బుజ్జగింపులు: ఢిల్లీకి టి - కాంగ్రెసు నేతలు?

అధిష్టానం పిలిచాక వెళ్లకపోతే ఇబ్బందులు ఉంటాయని సూచించినట్లుగా తెలుస్తోంది. వచ్చిన అవకాశం వదులుకోవద్దని సూచించారని సమాచారం. బొత్స వ్యాఖ్యల ప్రభావం కొందరు నేతలపై పడ్డట్లుగా తెలుస్తోంది. అధిష్టానం పిలిచినప్పుడు వెళ్లడమే మంచిదవుతుందని పలువురు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులో ఉండి ఏం చేయక పోవటం కంటే ఢిల్లీ వెళ్లి అధిష్టానం తెలంగాణ ఇవ్వాలని పట్టుబట్టడం ఉచితమని పలువురు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే చాలామంది సభ్యులు మాత్రం బొత్సతో విభేదించినప్పటికీ మంగళవారం తెలంగాణ నేతలు మరోసారి భేటీ అయి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications