అందుకే దాడి చేశా, చింతిస్తున్నా: హరీష్ రావు

యాదిరెడ్డి మృతదేహాన్ని దొంగచాటుగా అధికారులు విమానాశ్రయానికి తరలించారని ఈటెల రాజేందర్ అన్నారు. భౌతికాయం విషయంలో అధికారులు పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. మాపై విశ్వాసం లేని సీమాంధ్ర ప్రభుత్వాన్ని మేం గుర్తించమని అన్నారు. ఇంత రాద్దాంతం జరుగుతుంటే ఇంకా ఎలా కలిసి ఉండాలని అనుకుంటారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. దాడులకు ఎవరు పాల్పడినా అది తప్పే అని అన్నారు. అయితే ఆవేశంలో మాత్రమే హరీష్ రావు కొట్టాడని చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యువకుడిని అనాథ శవంలా తరలించినందుకే హరీష్ రావు ఆవేశంలో దాడి చేశారని సిరిసిల్ల ఎమ్మెల్యే కెటి రామారావు అన్నారు. కాగా సిపిఐ, కాంగ్రెసు నేతలు సైతం ఎపి భవన్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications