మాకో న్యాయం, సీమాంధ్రులకో న్యాయమా?: కెటిఆర్

నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని హరీష్ రావు అన్నారు. తెలంగాణ కోసం మృతి చెందిన యాదిరెడ్డి మృతదేహాన్ని ఎపి భవన్కు తరలించకుండా నేరుగా స్మశానానికి తరలించారని చందర్ రావు లేఖ రాయడంపై తాము జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలుస్తామని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతామని చెప్పారు. ఎపి భవన్లో తెలంగాణ వాళ్లు ఉంటే యాదిరెడ్డి మృతదేహానికి అవమానం జరిగేది కాదన్నారు. తెలంగాణ వారు మూడో కన్ను తెరిస్తే సీమాంధ్రులు హైదరాబాదులో తిరగలేరని మరో నేత అన్నారు. యాదిరెడ్డి త్యాగాన్ని కించపరిచే విధంగా అధికారులు ప్రవర్తించారని అన్నారు.












Click it and Unblock the Notifications