రాజీనామాలపై స్పీకర్ నిర్ణయానికి కట్టుబడుతా: సిఎం

ఎస్సీ వర్గీకరణ జరగాలంటే కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారానే సాధ్యమని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చర్చలు పూర్తయిన తర్వాత అసెంబ్లీలో పాస్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. నెల్లూరు జిల్లాలోని వేదాయపాళెం సెంటరులో బాబూజగన్జ్జీవన్రాం విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడారు. ఎస్సీలందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన పదిలక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు రూ.1600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.
అవినీతి నిర్మూలనలో భాగంగా రానున్న మూడు నెలల్లో ఈ-సేవా కేంద్రాల ద్వారా అన్ని సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రయోగాత్మకంగా కృష్ణా, ఖమ్మం, చిత్తూరు జిల్లాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వెంకటాచలం మండలంలోని కాకుటూరులో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీ భవనాల నిర్మాణం కోసం అదనంగా 10 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే మత్స్యకారుల విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం హామీ ఇచ్చారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications