వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక పోయే కాలం దగ్గర పడింది: బోనాలులో రాములమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayasanthi
హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలు తిరస్కరించిన సభాపతి నాదెండ్ల మనోహర్‌పై మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి నిప్పులు గక్కారు. కాంగ్రెసుపైనా ధ్వజమెత్తారు. ఆదివారం ఆమె లాల్ దర్వాజ అమ్మవారి బోనాల జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రాజీనామాలను తిరస్కరించి రాత్రికి రాత్రే స్పీకరు లండన్ వెళ్లవలసిన పని ఏమిటని ఆమె ప్రశ్నించారు. రాజీనామాలను తిరస్కరించి అప్పటికప్పుడు లండన్ వెళ్లడం కుట్రేనని ఆమె ఆరోపించారు.

తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామా డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. వారికి తెలంగాణపై చిత్తశుద్ధి లేదన్నారు. రాజ్యాంగ సంక్షోభంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీ యు టర్న్ తీసుకుంటుందని తాను మొదటి నుండి చెబుతున్నానని చెప్పారు. ఇక కాంగ్రెసుకు పోయే కాలం దగ్గర పడిందన్నారు. తాను కాంగ్రెసు పార్టీని అంతం చేయాలని అమ్మవారిని ప్రార్థించానని అన్నారు. కాగా అంతకుముందు గండదీపాన్ని అమ్మవారికి సమర్పించారు.

English summary
MP Vijayasanthi fired at speaker Nadendla Manohar today at Laldarwaja Bonalu Jatara. She accused congress U turn on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X