చంద్రబాబు ఆస్తులపై పడిన భూమా నాగిరెడ్డి దంపతులు
ఎమ్మెల్యేలంతా వైఎస్సార్ను సీఎంగా చూశాక మరే నాయకుడిని అలా ఊహించుకోలేకపోతున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా పంచెకట్టుకుని ఆసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ఎమ్మెల్యేలంతా కోరుకుంటున్నారన్నారు. అంతకుముందు డోన్ నియోజకవర్గ పార్టీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నివాసంలో శోభానాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ - ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రెండెకరాలున్న చంద్రబాబు నేడు వేల కోట్ల రూపాయలకు ఎలా అధిపతి అయ్యారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు అప్పనంగా భూములు కేటాయించారని, వాటిపైనా సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
bhuma nagireddy shobha nagi reddy chandrababu naidu kurnool భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి చంద్రబాబు నాయుడు కర్నూలు
English summary
YSR Congress party leaders Bhuma Nagi Reddy and Shobha Nagireddy lashed out at TDP president N Chandrababu Naidu.
Story first published: Tuesday, July 26, 2011, 8:45 [IST]