హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసులో హైకోర్టుకు సిబిఐ నివేదిక

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) మంగళవారం మధ్యాహ్నం హైకోర్టుకు నివేదికను సమర్పించింది. హైకోర్టు ఇచ్చిన గడువులోపల సిబిఐ ప్రాథమిక దర్యాప్తు నిర్వహించి, నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టులో సమర్పించింది. ఎమార్ ప్రాపర్టీస్, జగతి పబ్లికేషన్స్ ఆస్తులపై దర్యాప్తు చేసిన సిబిఐ నివేదిక సమర్పించింది.

సిబిఐ 28 కంపెనీలను విచారించింది. ఆ కంపెనీల ఐటి రిటర్న్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఆడిట్ నివేదికలు వంటి వివరాలను అడిగి తీసుకుంది. బెంగుళూర్, కోల్‌కత్తాలకు చెందిన కంపెనీలను కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందువల్లనే ప్రభుత్వానికి తక్కువ వాటా దక్కిందని సిబిఐ అధికారులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులు మరోసారి సోమవారం సిబిఐ అధికారులకు తమ వాదనలు వినిపించారు. బెంగుళూర్‌కు చెందిన మంత్రి, క్లాసిక్ వంటి సంస్థల ప్రతినిధులు సిబిఐ ముందు హాజరయ్యారు

English summary
CBI submitted its report to High Court in shield cover on YSR Congress party president YS Jagan's properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X