వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరంపై చిందులేసిన ఎంపి పొన్నం ప్రభాకర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏకాభిప్రాయం అవసరమని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. అన్ని పార్టీల వైఖరులు చెప్పిన తర్వాతనే చిదంబరం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆ ప్రకటన వెలువడిన తర్వాత పార్టీలు వైఖరులు మార్చుకుంటే వాటి గుర్తింపును ఎందుకు రద్దు చేయడం లేదని ఆయన అడిగారు. పార్టీలు చీలిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఎందుకు చీల్చడం లేదని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణకు అనుకూలంగా తాము గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ మరో లేఖను ఇవ్వాలని ఆయన కోరారు. తెలుగుదేశం ఆ లేఖను ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తేకపోతే తమదే బాధ్యత అవుతుందని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా అఖిలపక్ష సమావేశంలో వైఖరిని ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు వైఖరిని అడగలేదని, అప్పుడు తెలుగుదేశం పార్టీ తన వైఖరి మాత్రమే చెప్పిందని, అదువల్ల ఇప్పుడు కాంగ్రెసు వైఖరిని అడగాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం తన వైఖరి వెల్లడించాలని ఆయన అన్నారు.

English summary
Congress Telangana MP Ponnam Prabhakar opposed Union Home minister Chidambara,\m statement on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X