తెరాస ఉచ్చులో చంద్రబాబు, యనమల ప్రకటన తంటా
తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం మహానాడులో తీర్మానం చేశారు. యనమల రామకృష్ణుడు ప్రకటనను ఖండించకపోతే చంద్రబాబు సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారని అనుకోవాలని హరీష్ రావు అన్నారు. సీమాంధ్ర నేతలు తవ్రవాదులు కన్నా హీనమని ఆయన అన్నారు. చంద్రబాబుతో కలిసి వచ్చి పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం హాల్లో యనమల ప్రకటన చేశారని, యనమల చేత చంద్రబాబు ఆ ప్రకటన చేయించారని ఆయన అన్నారు. హరీష్ రావు, యనమల మధ్య ఓ టీవీ చానెల్ వాగ్వివాదాన్ని నడిపించింది.
తెలంగాణకు అనుకూలమా, వ్యతిరేకమా అని హరీష్ రావు అడిగితే నీకు చెప్పాల్సిన అవసరం లేదని యనమల రామకృష్ణుడు అన్నారు. 2011 మహానాడు తీర్మానం తమ పార్టీ విధానమని యనమల రామకృష్ణుడు మరోసారి చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ కమిటీకి తాము ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర చెప్పగలదా అని కూడా యనమల ఇటీవల అడిగారు. తెలుగుదేశం పార్టీది సమైక్యవాదమే అయితే ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే పడుతుందని హరీష్ రావు అన్నారు.