రాజీనామాల పేరుతో రాజీ డ్రామాలు: హరీష్ రావు
ప్రజల కోణంలో కాకుండా రాజకీయ కోణంలో పార్టీల నేతలు చూస్తుండటం వల్లే ప్రత్యేక రాష్ట్రం రావటం లేదని తెదేపా సీనియర్ నేత కడియం శ్రీహరి అన్నారు. పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించ్చేందుకు ఆజాద్ చర్చలు జరుపుతున్నారే తప్ప తెలంగాణ ఇవ్వటం కోసం కాదని, ఈ విషయాన్ని ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు గుర్తించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ సూచించారు. ప్రత్యేక రాష్ట్ర అంశంలో స్పష్టమైన వైఖరితో వచ్చే పార్టీలతో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.
కాగా తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఎంపీలు రాజీనామాలపై వెనక్కి తగ్గవద్దని టిఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్లో అన్నారు. ఎంపీలు రాజీనామాలపై వెనక్కి తగ్గకుండా ఉంటే తెలంగాణ ప్రజలు వారిని బ్రహ్మాండమైన ఆధిక్యంతో గెలిపించి తెలంగాణ సభ్యులుగా పార్లమెంటుసు పంపిస్తారని అన్నారు. ఉద్యోగ సంఘాల సమ్మె కారణంగా తెలంగాణ వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.