వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొండిగా పోతే బంద్: సిఎంకు కెసిఆర్ హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 14ఎఫ్ తొలగించకుండా ఎస్సై పరీక్షలు నిర్వహించాలని మొండిగా వెళితే ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత ఆయనదే అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం హెచ్చరించారు. 14ఎఫ్ రద్దు చేయకుండా ఎస్సై పరీక్షలు నిర్వహించకూడదని సూచించారు. మొండిగా వెళ్లి నిర్వహించాలని చూస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరన్నారు. ఎస్సై పరీక్షలు రద్దు చేయనందుకు నిరసనగా ఆగస్టు 1న రాస్తా రోకోలు, 2వ తేదిన నిరసన ర్యాలీలు ఉంటాయని చెప్పారు.

3వ తేదిన ముఖ్యమంత్రి, డిజిపి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తారని అన్నారు. 4వ తేదిన అఖిల పక్షాలతో రౌండ్ టేబులు సమావేశం, అప్పటికీ ముఖ్యమంత్రి దిగి రాకుంటే 5న బందుకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఎస్సై పరీక్షల రద్దు కోరుతూ విద్యార్థి జెఏసి చేస్తున్న ఆందోళనలో అన్ని విద్యార్థి సంఘాలు పాల్గొనాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆరునూరైన తెలంగాణ సాధిస్తామని చెప్పారు.

English summary
TRS chief K Chandrasekhar Rao warned CM Kiran Kumar Reddy on SI exams. He suggested him that to postpone exams till 14f cancel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X