చెప్పారు.. చేశారు: పార్లమెంటుకు ఎంపీలు డుమ్మా

పార్లమెంటు సమావేశాలకు ముందు రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు ఇంట్లో కాంగ్రెసు ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాము పార్లమెంటు సమావేశాలకు హాజరు కావటం లేదని స్పష్టం చేశారు. తమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాదుతో చర్చించిన తర్వాతే సమావేశాలకు వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా రాజ్యసభలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకు నివాళ్లు అర్పించారు. రాజ్యసభ సభ్యుడు అహ్మద్ అన్సారీ తీర్మానం ప్రవేశ పెట్టారు.












Click it and Unblock the Notifications