నా వద్ద లాప్ట్యాపే లేదు, వార్తలు అబద్ధం: వెంకయ్య

అత్త మీది కోపం దుత్త మీద చూపినట్లు కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన ఆగ్రహాన్ని బిజెపి జాతీయ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడి లాప్ట్యాప్పై చూపించారని వార్తలు వచ్చాయి. తనను సముదాయించడానికి ప్రయత్నిస్తున్న వెంకయ్యనాయుడిపై ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంకయ్య నాయుడి లాప్ట్యాప్ను లాక్కుని కిందికి విసిరికొట్టారు. ఆదివారంనాడు హోటల్ లలిత్ అశోక్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
తనకు సన్నిహితుడైన ఓ మంత్రి తనను రేస్ కోర్సు రోడ్డులోని నివాసంలో నిద్ర లేపినందుకు కూడా యడ్యూరప్ప తన ఆగ్రహాన్ని చూపించారని అంటున్నారు. ఆ మంత్రి చెంపపై ఆయన చెల్లుమనిపించారని సమాచారం. రాజీనామా చేయాలని పార్టీ జాతీయ నాయకత్వం ఒత్తిడి పెంచిన నేపథ్యంలో ఆయన తట్టుకోలేని మానసిక స్థితికి వెళ్లారని చెబుతున్నారు. యడ్యూరప్పను సమర్థిస్తూ వచ్చిన వెంకయ్య నాయుడు ఆయనను తొలగించే విషయంలో జాతీయ నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications