కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడపలో మహిళ, పురుషుడి సజీవ దహనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kadapa
కడప: జిల్లాలోని సుండుపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం రెండు మృతదేహాలను పోలీసులు కనుగొన్నట్టుగా తెలుస్తోంది. సుండుపల్లి మండలం అనంపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో ఒక మహిళ, మరో పురుషుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. వారిని ఎవరో దుండగులు సజీవ దహనం చేసినట్లుగా తెలుస్తోంది. మృతదేహాలను పరిశీలించిన పోలీసులు సజీవ దహనం ఘటన వారం రోజుల క్రితమే జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దాదాపు ఎవరూ తిరగని అటవీ ప్రాంతం కావడంతో వారం రోజులుగా సమాచారం లేకుండా ఉందని భావిస్తున్నారు.

దుండగులు వారిద్దరినీ సజీవ దహనం చేయక ముందే చంపేసి ఆ తర్వాతే మృతదేహాలపై పెట్రోలు పోసి నిప్పంటించినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట వారు భార్యాభర్తలను భావించిన పోలీసులు వివాహేతర సంబంధం కూడా కావచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని కోణాల్లోనూ దర్యాఫ్తు చేస్తన్నారు. మృతదేహాలు ఎవరివో గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు.

English summary
Kadapa police found two dead bodies in Kadapa district forest today. Police were suspecting that the incident occurred a week ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X