వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరం మాటలు మోసపూరితం: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణపై కేంద్ర మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు మోసపూరితం అని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ శుక్రవారం అన్నారు. తెలంగాణపై కాలపరిమితితో కూడిన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ మొదట తన నిర్ణయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటనపై ఎవరికైనా అనుమానాలు ఉంటే అందరికీ నచ్చజెప్పాల్సిన బాధ్యత వారికి ఉందన్నారు. 14ఎఫ్ పై ప్రభుత్వం కళ్లు తెరిచేలా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కోదండరామ్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ 14ఎఫ్ రద్దు చేయకుంటే హైదరాబాదీల స్థానికతకు అర్థం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొండిగా పోయి 14ఎఫ్ రద్దు చేయకుండానే పరీక్షలు నిర్వహిస్తామంటే అడ్డుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పరీక్షలకు రెండు రోజుల ముందు తెలంగాణ బందుకు పిలుపునిస్తామని చెప్పారు. 14ఎఫ్ పై కేంద్రమంత్రి చిదంబరం 45 రోజుల క్రితమే లేఖ రాసినప్పటికీ సిఎం ఇంత ఆలస్యంగా స్పందించడమేమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, టిడిపి బహిష్కృత నేత నాగం జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Telangana political JAC chairman Kodandaram condemned Union minister Chidambaram statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X