చంద్రబాబు ఎప్పుడూ వ్యతిరేకే: సర్వే సత్యనారాయణ

తెలంగాణ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తారని తమకు నమ్మకం ఉందన్నారు. తెలంగాణపై చర్చ జరుగుతున్న సమయంలో సభలో సోనియా లేక పోవడం బాధాకరం అన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ మా జన్మహక్కు అన్నారు. అయితే టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ వలె తాము ఆంధ్రా వారు బాగో అనడం లేదన్నారు. నాడు బలవంతంగా భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలంగాణ, ఆంధ్రను కలిపారన్నారు. ఆత్మ గౌరవం కోసమే తెలంగాణ అన్నారు. ప్రజల భావోద్వేగాలను సోనియా అర్థం చేసుకున్నారని అన్నారు. తెలంగాణకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని అన్నారు.
హైదరాబాదు లేని తెలంగాణ మెడలేని మొండెం వంటిదన్నారు. ఉద్యమాలతో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ స్తంభించాయన్నారు. గూర్ఖాలాండు తరహా ప్యాకేజికి తాము వ్యతిరేకం అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఏమీ తేల్చకుండా ఇలా అలా చేయమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలు ఇచ్చిన బిజెపి ఆనాడే పట్టించుకుంటే ఇబ్బంది ఉండక పోయేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదన్నారు. సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు అడ్డుపడిన తెలుగుదేశం పార్టీ ఆలోచనలో నేటికి మార్పు లేదన్నారు. చంద్రబాబు అప్పుడు ఇప్పుడూ అడ్డుపడుతున్నారన్నారు. తెలంగాణ వాదులు ఏ పార్టీలో ఉన్నా అందరూ సోదరులే అన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications