కెసిఆర్ క్షమాపణ చెప్పాలి: ఎర్రబెల్లి దయాకర రావు

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం తప్పు బట్టారు. కెసిఆర్ ప్రస్తుత ఉద్యమం గురించి మాట్లాడకుండా 2014 గురించి మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పదకొండేళ్లుగా తెలంగాణ వస్తుందని కెసిఆర్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 2014 ఎన్నికలంటూ మాట్లాడింది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అని విమర్శించారు. ఇందుకు కెసిఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 11, 12వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగుతామని చెప్పారు. కాంగ్రెసు ప్రజా ప్రతినిధులను తెలంగాణకు ఒప్పిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సైతం మరోసారి రాజీనామాలకు సిద్ధమని చెప్పారు. అయితే రాజీనామాలు రాజకీయ సంక్షోభానికి ఉపయోగ పడాలే కానీ రాజకీయ లబ్ధికి ఉపయోగపడకూడదని తమ ఉద్దేశ్యం అన్నారు. తెలంగాణపై కేంద్రం దిగి వచ్చే వరకు ఉద్యమిస్తామని చెప్పారు. కేంద్రానికి టిడిపి మరోసారి లేఖ ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెసు ఎంపీలు పొన్నం ప్రభాకర్, కె కేశవరావు చెప్పిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ బిల్లు వెంటనే పార్లమెంటులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+