కెసిఆర్ క్షమాపణ చెప్పాలి: ఎర్రబెల్లి దయాకర రావు

ఈ నెల 11, 12వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగుతామని చెప్పారు. కాంగ్రెసు ప్రజా ప్రతినిధులను తెలంగాణకు ఒప్పిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సైతం మరోసారి రాజీనామాలకు సిద్ధమని చెప్పారు. అయితే రాజీనామాలు రాజకీయ సంక్షోభానికి ఉపయోగ పడాలే కానీ రాజకీయ లబ్ధికి ఉపయోగపడకూడదని తమ ఉద్దేశ్యం అన్నారు. తెలంగాణపై కేంద్రం దిగి వచ్చే వరకు ఉద్యమిస్తామని చెప్పారు. కేంద్రానికి టిడిపి మరోసారి లేఖ ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెసు ఎంపీలు పొన్నం ప్రభాకర్, కె కేశవరావు చెప్పిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ బిల్లు వెంటనే పార్లమెంటులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications