విభజనపై వైఖరేంటి?: వైయస్ జగన్‌కు సమైక్యాంధ్ర సెగ

YS Jagan
రాజమండ్రి: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సోమవారం సమైక్య సెగ తగిలింది. జగన్‌ను సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి సోమవారం అడ్డుకుంది. పంట విరామం ప్రకటించిన తూర్పు గోదావరి జిల్లా రైతులను పరామర్శించేందుకు ఆయన సోమ, మంగళ వారాలు జిల్లాలో పర్యటించనున్నారు. అందులో భాగంగా ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్టులో దిగి రైతులను పరామర్శించేందుకు బయలు దేరారు. ఈ సమయంలో సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి జగన్ వాహనాన్ని అడ్డుకుంది. రాష్ట్ర విభజనపై పార్టీ నిర్ణయాన్ని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటులో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకున్న జగన్ పార్టీ పెట్టాక మాత్రం విభజనపై ప్రకటన చేయక పోవడమేమిటని వారు ప్రశ్నించారు.

విభజనపై పార్టీ నిర్ణయం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. 14ఎఫ్ పైనా స్పందించాలని వారు డిమాండ్ చేశారు. దాదాపు పది నిమిషాలు జగన్ వాహనాన్ని అడ్డుకున్నారు. విద్యార్థి నేతలు ఇచ్చిన వినతి పత్రాలను జగన్ స్వీకరించారు. జగన్ ఏ నిర్ణయం చెప్పక పోవడంతో నిర్ణయం చెప్పే వరకు కదలనివ్వమన్నారు. పోలీసులు, జగన్ పార్టీ కార్యకర్తలు విద్యార్థులను పక్కకు తోసేసి జగన్‌ను పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే జగన్ పర్యటన రెండు రోజుల పాటు జిల్లాలో ఉండటంతో విద్యార్థులు అడ్డుకునే ఆస్కారం ఉందని వైయస్సార్సీ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+