చిదంబరంతో చంద్రబాబు రహస్య భేటీ, జగన్పైనే?
వైయస్ జగన్ ఆస్తుల కేసుపై హైకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో చంద్రబాబు చిదంబరంతో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్లు ఆ చానెల్ వ్యాఖ్యానించింది. జగన్పై కేసు వేసిన మంత్రి శంకరరావు ఇటీవల చిదంబరాన్ని కలిశారు. శంకరరావు భేటీ తర్వాత చంద్రబాబు చిదంబరంతో సమావేశం కావడం వెనక కలిసిపోయి జగన్పై కుట్ర చేయడానికేనని ఆ చానెల్ వ్యాఖ్యానించింది. చంద్రబాబు చాటుమాటు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఓ పార్లమెంటు సభ్యుడికి చెందిన కారులో ఎవరికీ చెప్పకుండా చంద్రబాబు మంగళవారం రాత్రి వెళ్లిపోయారని చానెల్ తెలిపింది.
గంటపాటు అదృశ్యమైన చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారంటూ సాక్షి చానెల్ ప్రశ్నిస్తూనే తాము చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయి చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నామని వ్యాఖ్యానించింది. చంద్రబాబు చిదంబరంతో తెలంగాణ అంశంపై కూడా మాట్లాడి ఉండవచ్చునని అంటున్నారు.