వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆందోళన బాటలో సమైక్యాంధ్ర విద్యార్థి, రేపు బంద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

United Andhra
విశాఖపట్నం: 14ఎఫ్ రద్దు చేయాలంటూ ఇప్పటి వరకు అట్టుడికి తెలంగాణ ప్రాంతం ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లి పోయింది. 14ఎఫ్ రద్దు చేస్తున్నట్లు కేంద్రం నుండి సంకేతాలు రావడంతో సీమాంధ్రలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నంలోని జివిఎంసిసి దగ్గర గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి బుధవారం నిరసన తెలిపింది. కేంద్రం 14ఎఫ్ రద్దు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 14ఎఫ్ రద్దు చేయవద్దని డిమాండ్ చేశారు. రద్దు చేస్తే ఊరుకునేది లేదన్నారు.

14ఎఫ్ రద్దుకు నిరసనగా గురువారం సీమాంధ్ర బందుకు పిలుపునుస్తన్నట్లు సమైక్యాంధ్ర జెఏసి ప్రకటించింది. విద్యాసంస్థలతో సహా అందరూ బందులో పాల్గొనాలని జెఏసి పిలుపునిచ్చింది. మరోవైపు తెలంగాణవాదులు సైతం 14ఎఫ్ రద్దు చేస్తామని కేంద్రం నుండి సంకేతాలు వచ్చినంత మాత్రాన తాము ఆందోళనలు విరమించేది లేదని ఆర్డర్ వచ్చాకే ఆందోళనలు విరమిస్తామని హెచ్చరిస్తున్నారు.

English summary
Samaikyandhra Joint Action Committee called to Seemandhra bandh tomorrow against 14f cancel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X