కృష్ణాలోనూ భాను భూదందా: పక్కా ప్లానింగ్తోనే?

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి నాటి వైయస్ ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో భవిష్యత్తులో అక్కడ భూములు ధరలు పెరుగుతాయని భావించిన భాను తన పేరుతో 9.27 ఎకరాలు, కృష్ణ అనే వ్యక్తి పేరిట 10.24 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా బయటపడినట్లు సమాచారం. సముద్ర తీర ప్రాంతం కావడంతో పోర్టు వస్తే భూములు ధరలు భారీగా పెరుగుతాయని భాను భావించినట్లుగా తెలుస్తోంది. నిడమర్రు పరిధిలో పొలం కొన్నట్లుగా తెలుస్తోంది. గోబిలేరు ప్రాంతంలోనూ కొంత భూమి కొన్నట్లు తెలుస్తోంది. ధరలు పెరుగుతాయనుకునే పరిసర భూములను కేవలం తానొక్కడే కొనకుండా సినిమా ఇండస్ట్రీతో తనకు ఉన్న పరిచయం నేపథ్యంలో ఇండస్ట్రీలోని పలువురిచే భూములు కొనిపించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications