కొండా లక్ష్మణ్ బాపూజీతో లగడపాటి భేటీ మతలబు?

తాము కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్కు ఇచ్చిన సమైక్యాంధ్ర రాష్ట్ర నివేదికను తాను కొండా లక్ష్మణ్ బాపూజీకి అందించినట్లు లగడపాటి రాజగోపాల్ సమావేశానంతరం చెప్పారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని తాము ఇద్దరం నమ్మినట్లు ఆయన తెలిపారు. తాను కొండా లక్ష్మణ్ బాపూజీని విజయవాడుకు ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. తాను తెలంగాణలో పర్యటించడానికి తగిన వాతావరణం లేదని ఆయన చెప్పారు. తాను తెలంగాణ ప్రజల మనోభావాలను ఎప్పూడూ అగౌరవపరచలేదని, అభిప్రాయాలతో విభేదించి ఉండవచ్చునని ఆయన అన్నారు.
ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సామరస్యవూర్వక వాతావరణం ఏర్పడాల్సి ఉందని, ఇందుకు గాను ఇరు ప్రాంతాల్లో సమావేశాలను నిర్వహించాలని అనుకున్నామని కొండా లక్ష్మణ్ బాపూజీ చెప్పారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలను తాము తొలగిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications