వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ తప్పించుకోవాలనుకుంటున్నారు: విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
న్యూఢిల్లీ: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తప్పులను మంత్రివర్గం పైకి నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ఆదివారం అన్నారు. నాటి మంత్రివర్గానికి తెలియకుండా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చాలా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. మంత్రివర్గానికి తెలియకుండా వైయస్, కెవిపిలు కలిసే నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. నాటి నిర్ణయాలపై మంత్రివర్గాన్ని ప్రశ్నిస్తున్న వైయస్సాఆర్సీ నేతలు కెవిపిని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు.

ప్రజాధనం దుర్వినియోగంలో జగన్ ఎంత బాధ్యుడో కెవిపి అంతే బాధ్యుడన్నారు. జగన్ నల్లమచ్చ లేని నాయకుడని గతంలో పలికిన వైస్సార్సీ నేతలు ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అనడం ఏమిటన్నారు. మచ్చలేని నాయకుడు అయితే నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు. హైకోర్టుకు జగన్ పైన కక్ష ఎందుకు ఉంటుందన్నారు. త్వరలో అంబటి రాంబాబు వ్యవహారాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. 14ఎఫ్ రద్దుకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ దృష్టికి తీసుకు వెళతానని హెచ్చరించారు. తెలంగాణ వారిది ప్రజల ఉద్యమం అయితే సీమాంధ్రులది స్పాన్సర్ల ఉద్యమం అన్నారు.

English summary
Congress party senior MP V Hanumantha Rao blamed YS Jaganmohan Reddy for his attitude on CBI enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X