వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ వేదికగా క్రాప్‌ హాలిడేపై దీక్షకు బాబు యోచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రైతుల సమస్యపై మరోసారి దీక్ష చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పంట విరామాన్ని ప్రకటించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో మరోసారి రైతుల కోసం నిరాహార దీక్ష చేయాలని ప్రభుత్వంలో కదలిక తేవాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల రైతాంగ సమస్యలపై చంద్రబాబు వారం రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు దీక్ష తర్వాత అప్పుడు ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అదే తరహా ఇప్పుడు కూడా రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో మరోసారి దీక్ష చేయాలని బాబు యోచిస్తన్నట్టుగా తెలుస్తోంది.

అయితే గతంలో హైదరాబాదులో దీక్ష చేసిన చంద్రబాబు ఈసారి ఢిల్లీ వేదికగా దీక్ష చేయాలని యోచిస్తున్నట్టుగా సమాచారం. జాతీయ స్థాయిలో రాష్ట్ర రైతాంగ సమస్యలను తీసుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే ఢిల్లీని వేదికగా చేసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర రైతాంగానికి జాతీయస్థాయి నేతల మద్దతును కూడగట్టి తద్వారా పార్లమెంటులో రాష్ట్ర రైతాంగ సమస్యలపై వారంతా స్పందించేందుకు వీలుగా ఢిల్లీ వేదికనే సరియైనదిగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీక్ష చేసేది లేనిది సాయంత్రం టిడిపి పోలీట్ బ్యూరోలో మాట్లాడిన అనంతరం నిర్ణయించే అవకాశం ఉంది. ఈ నిరాహార దీక్షకు సిద్ధపడిన పక్షంలో ఈ నెలాఖరులోగా కానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ దీక్ష ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ నెల 26, 27 తేదీల్లో జాతీయస్థాయి నేతలతో కలిసి కోనసీమలో రైతులను పరామర్శించనున్నారు.

English summary
TDP chief Chandrababu Naidu is thinking about fast to support state farmers. TDP politi bureau will met today and decide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X