సిబిఐ దాడులకు సహకరిస్తా: అంబటి రాంబాబు వెల్లడి

Ambati Rambabu
హైదరాబాద్: ఎమ్మార్ విషయమై సిబిఐ అధికారులు తనను ఎవరూ సంప్రదించలేదని మాజీ ఎపిఐఐసి చైర్మన్ అంబటి రాంబాబు వేరుగా అన్నారు. సిబిఐ అధికారులు తనను సంప్రదిస్తే వారికి పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎమ్మార్ అక్రమాలలో నా ప్రమేయం ఉన్నట్లు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. తన హయాంలో అవకతవకలు జరిగాయని భావిస్తే వివరణ ఇవ్వడానికి సిద్ధమని చెప్పారు. కాగా వైయస్ విజయమ్మ, భారతిలతో అంబటి భేటీ అయ్యారు.

వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని ఎవరైనా ఫిర్యాదు చేశారా? అని ప్రజారాజ్యం పార్టీ అసమ్మతి శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో కలిసి శుక్రవారం ప్రశ్నించారు. జగన్ పైన ఎవరూ ఫిర్యాదు చేయనప్పుడు 420 కేసు ఎందుకు పెడతారని ప్రశ్నించారు. కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే జగన్ పైన హైకోర్టులో కేసు వేశారని అన్నారు. వైయస్ హయాంలో అక్రమాలు జరిగాయని భావిస్తే వైయస్ మంత్రివర్గంలోని అందరు మంత్రుల పైన విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. నాటి మంత్రివర్గ నిర్ణయాలలో మంత్రుల సమష్టి బాధ్యత ఉంటుందని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+