ఎమ్మెల్యేలను కొనేందుకు జగన్ యత్నం: బొత్స

Botsa Satyanarayana
హైదరాబాద్: ఇతర పార్టీల శాసనసభ్యులను కొందరు స్వార్థపూరిత వ్యక్తులు రూ.5 కోట్ల నుండి రూ.10 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు గాంధీ భవనంలో కాంగ్రెసు సభ్యత్వం తీసుకున్న సందర్భంగా బొత్స సమావేశంలో మాట్లాడారు. కొందరు ధనమదంతో వ్యవహరిస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న దురాలోచనతో కొందరు ఉన్నారన్నారు.

ప్రభుత్వం పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైనా ఉందన్నారు. జిల్లాల్లో కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కలిసి పని చేయాలని బొత్స సూచించారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నదే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆకాంక్ష అని అన్నారు. అది మనందరం కలిసి నెరవేర్చాలన్నారు. కాంగ్రెసులో పిఆర్పీ విలీనం సైతం వైయస్ ఆకాంక్ష అన్నారు. నీతివంతమైన పాలన అందించాలన్నదే కాంగ్రెసు ప్రభుత్వం ఆకాంక్ష అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+