వైయస్ జగన్ వర్గం రాజీనామాలపై కాంగ్రెసు డోంట్ కేర్

మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామాలను ఓ డ్రామాగా అన్నారు. దేశమంతా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే జగన్ వర్గం మాత్రం అవినీతికి మద్దతుగా ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. జగన్ కాంగ్రెసు ద్వారా ఎదిగి ఆ కాంగ్రెసునే దెబ్బ తీయాలని చూస్తున్నారని ఎంపీ పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. రాజీనామాలపై మాజీ ముఖ్యమంత్రి రోశయ్య స్పందిస్తూ రాజీనామాలతో ప్రభుత్వం పడిపోతుందో లేదో ఆలోచించే శక్తి తనకు లేదని చెప్పారు. జగన్ వర్గం నేతలు ఆలస్యంగా రాజీనామాలు చేశారని ఈ పని ఎప్పుడో చేయాల్సి ఉండెనని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సైతం జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయవద్దని కోరినప్పటికీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. మరో నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి రాజీనామాలపై పునరాలోచించుకోవాలని చెప్పారు. అయితే వారిని బతిమాలే విధమైన విధంగా మాట్లాడేది లేదన్నారు. తదుపరి నిర్ణయం వారిదే అన్నారు.












Click it and Unblock the Notifications