వైయస్ జగన్ వెంట మరో 13 మంది ఎమ్మెల్యేలు?

శాసనసభ్యుల రాజీనామాల గురించి, తాజా పరిణామాల గురించి పిల్లి సుభాష్ చంద్రబోస్ వైయస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ప్రస్తుతం జగన్కు మద్దతుగా 29 మంది శాసనసభ్యులు ముందుకు వచ్చారని, మరింత మంది వస్తారని జగన్తో భేటీ అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, అధైర్యపడవద్దని, ధైర్యంగా ముందుకు సాగుదామని వైయస్ జగన్మోహన్ రెడ్డి తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు.
తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని, తమ రాజీనామాలు డ్రామా కాదని వైయస్ జగన్ వర్గానికి చెందిన శోభా నాగిరెడ్డి అన్నారు. రాజీనామాలు చేసిన తర్వాత పులివెందుల వెళ్లిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు మంగళవారం హైదరాబాదు తిరిగి వచ్చారు. తమ రాజీనామాలను ఆమోదించాల్సిందేనని ఆమె అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుంటే తమ రాజీనామాలను ఆమోదించాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications