వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్, ఎమ్మార్ కేసు రికార్డులు కోర్టుకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI Logo
హైదరాబాద్: వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మార్ అక్రమాల కేసులో సేకరించిన రికార్డులను సిబిఐ మంగళవారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు సమర్పించింది. సిబిఐ ఎస్పీ వెంకటేష్ సోదాలలో సేకరించిన సమాచారాన్ని కోర్టుకు సమర్పించారు. జగన్ ఆస్తులు, ఎమ్మార్ కేసులోని పురోగతిని నాంపల్లి కోర్టుకు వివరించారు. కేసుల్లో తదుపరి చర్యలకు అనుమతించాలని సిబిఐ కోర్టును కోరింది. కాగా కేసుకు సంబంధించి రికార్డులు రేపు కోర్టుకు సమర్పిస్తారని అనుకున్నప్పటికీ మంగళవారమే సమర్పించారు.

కాగా అంతకుముందు సేకరించిన దస్త్రాలను సిబిఐ అధికారులు ఉదయం పరిశీలించారు. స్వాధీనం చేసుకున్న పత్రాలను, సిడిలను సిబిఐ అధికారులు జెడి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో పరిశీలించారు. 32 కంపెనీలు, వ్యక్తులకు చెందిన రికార్డులను పరిశీలించారు. కేసులలో సాక్ష్యాలకు పనికొచ్చే దస్త్రాలను వేరు చేశారు. సోదాల్లో సేకరించిన పత్రాలను స్కాన్ చేసి సిడిల్లో భద్రపరిచారు. కేసులో తదుపరి దర్యాఫ్తు కోసం 8 బృందాలను సిబిఐ ఏర్పాటు చేశారు. నిందితులను విచారించేందుకు ప్రశ్నావళిని తయారు చేశారు.

English summary
CBI officers submitted documents and hard disks in Court which are they found in YSRC Party president YS Jaganmohan Reddy and EMAAR case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X