హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవిపై విమర్శలా?: అంబటిపై పొంగులేటి సుధాకర్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponguleti Sudhakar Reddy
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారంటున్న వైయస్సార్సీ పార్టీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెసు నేతలు మండిపడ్డారు. చిరంజీవి లాంటి వ్యక్తిని అమ్ముడు పోయారని జగన్ వర్గం నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మంగళవారం అన్నారు. కొండా సురేఖ, జయసుధ, కుంజా సత్యవతి తెలంగాణ అంశాన్ని ముడిపెట్టి రాజీనామాలపై వెనక్కి తగ్గారన్నారు. జగన్ తల్లి, తండ్రి సెంటిమెంటు అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. జగన్ వర్గం నేతలు తమ భాషను మార్చుకోవాలని సూచించారు.

అత్యంత అవినీతిపరులతో సావాసం చేస్తున్న వైయస్సార్సీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు చిరంజీవి గురించి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే అనిల్ అన్నారు. చిరంజీవి డబ్బులు తీసుకొని విలీనం చేశారని నిరూపిస్తే తాను రాజకీయల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఎపిఐఐసిలో అంబటి ఎన్ని కోట్లు మింగారో చెప్పాలన్నారు.

English summary
MLC Ponguleti Sudhakar Reddy fired at YSRC spokes person Ambati Rambabu today for blaming Chiranjeevi on merger issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X