పరిటాల హత్య కేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు
ఈ కేసులో మరో ముగ్గురు ప్రధాన నిందితులు హత్యకు గురయ్యారు. ప్రధాన నిందితులు అయిన మద్దెలచెర్వు సూరి, మొద్దు శీను, తరగకుండ కొండారెడ్డిలు హత్యకు గురయ్యారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే వారు హత్యకు గురయ్యారు. మిగిలిన ఎనిమిది మందిని దోషులుగా నిర్దారిస్తూ గురువారం మధ్యాహ్నం కోర్టు తీర్పు చెప్పింది. వారిలో వడ్డె కొండ, వడ్డె శీను, రేఖమయ్య, నారాయణ రెడ్డి, రంగనాయకులు, పెద్దిరెడ్డి, హన్మంత రెడ్డి, ఓబిరెడ్డి లకు జీవిత ఖైదు విధించింది. కాగా తీర్పు సమయంలో తమకు శిక్షను తగ్గించాలని నిందితులు కోర్టును వేడుకున్నారు.
కాగా పరిటాల రవి హత్య కేసులో 133 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఇందులో 16 మందిని నిందితులుగా పేర్కొంది. పదహారు మందిలో ముగ్గురు ఇప్పటికే హత్యకు గురయ్యారు. ఈ కేసు ఆరేళ్ల పాటు విచారణ జరిగింది. పరిటాల రవి 2005 జనవరి 24వ తేదిన అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో హత్యకు గురయ్యారు.