పరిటాల హత్య కేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు

ఈ కేసులో మరో ముగ్గురు ప్రధాన నిందితులు హత్యకు గురయ్యారు. ప్రధాన నిందితులు అయిన మద్దెలచెర్వు సూరి, మొద్దు శీను, తరగకుండ కొండారెడ్డిలు హత్యకు గురయ్యారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే వారు హత్యకు గురయ్యారు. మిగిలిన ఎనిమిది మందిని దోషులుగా నిర్దారిస్తూ గురువారం మధ్యాహ్నం కోర్టు తీర్పు చెప్పింది. వారిలో వడ్డె కొండ, వడ్డె శీను, రేఖమయ్య, నారాయణ రెడ్డి, రంగనాయకులు, పెద్దిరెడ్డి, హన్మంత రెడ్డి, ఓబిరెడ్డి లకు జీవిత ఖైదు విధించింది. కాగా తీర్పు సమయంలో తమకు శిక్షను తగ్గించాలని నిందితులు కోర్టును వేడుకున్నారు.
కాగా పరిటాల రవి హత్య కేసులో 133 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఇందులో 16 మందిని నిందితులుగా పేర్కొంది. పదహారు మందిలో ముగ్గురు ఇప్పటికే హత్యకు గురయ్యారు. ఈ కేసు ఆరేళ్ల పాటు విచారణ జరిగింది. పరిటాల రవి 2005 జనవరి 24వ తేదిన అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో హత్యకు గురయ్యారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications