వైయస్ పుస్తకావిష్కరణ సభ: కెవిపికి విహెచ్ షాక్

పుస్తకావిష్కరణ సభకు వెళ్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బలపరిచినట్లేనని ఆయన అన్నారు. వైయస్ జగన్ తల్లి కూడా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తిట్టారని ఆయన గుర్తు చేశారు. ఆ సభకు వెళ్తే కాంగ్రెసుకు సంబంధించి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. జగన్ సాక్షి దినపత్రికలో కాంగ్రెసును దుయ్యబడుతూ వార్తలు రాస్తున్న నేపథ్యంలో వైయస్ పుస్తకావిష్కరణ సభకు వెళ్లడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ జగన్ను సమర్థిస్తూ బిజెపి నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ బిజెపితో జగన్ స్నేహం చేస్తున్న నేపథ్యంలో వైయస్ పుస్తకావిష్కరణ సభకు వెళ్లడం మంచిది కాదని ఆయన అన్నారు.
వైయస్సార్ పుస్తకావిష్కరణ సభకు గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోనీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వంటి వారంతా వెళ్లాల్సి ఉంది. విహెచ్ లేఖ నేపథ్యంలో సభకు వెళ్లాలా, వద్దా అనే విషయంపై కొంత మంది మీమాంసలో పడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications